ప్రత్తిపాటి కుమారుడికి 14 రోజులు రిమాండ్

2924చూసినవారు
ప్రత్తిపాటి కుమారుడికి 14 రోజులు రిమాండ్
ఏపీ మాజీమంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌బాబును విజయవాడ పోలీసులు జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపు ఆరోపణలపై అరెస్టు చేశారు. అనంతరం 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి కరీముల్లా నివాసంలో శరత్‌ను హాజరుపరిచారు. ఈ కేసులో 409 సెక్షన్ చెల్లదన్న న్యాయమూర్తి.. 469 సెక్షన్ పరిగణనలోకి తీసుకుని 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో శరత్‌ను జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్