జేసీ ప్రభాకర్ రెడ్డి సచివాలయ ఉద్యోగులను సైతం బెదిరిస్తున్నాడని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మంగళవారం విమర్శించారు. యాడికి మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు మీ ఉద్యోగం చేయండి. మీరు ఎమ్మెల్యే మాట విని వైసీపీకి ఓటు వేస్తే మేము గెలిచి మా పార్టీ వస్తే మీ అంతు చూస్తా' అని భయపెట్టడం సిగ్గుచేటన్నారు. అందరినీ బెదిరించేందుకు ప్రయత్నం చేస్తున్నాడన్నారు.