ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని ఇన్చార్జి ఎస్ఐ గౌస్ భాష సూచించారు. ఆదివారం ఆయన పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఆటో, ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల్లో ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అత్యాశకు పోయిు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడవద్దని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు.