పెన్నహోబిలం శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

70చూసినవారు
పెన్నహోబిలం శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. శ్రీవారి మూలవిరాటుకు ఉదయం నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ నుంచి భక్తులు పెద్దఎత్తున దర్శనానికి వచ్చారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్