మాజీ సీఎంపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ మృతి

77చూసినవారు
మాజీ సీఎంపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ మృతి
బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ మహిళ గతంలో ఆరోపణలు చేసింది. కాగా ఆ మహిళ మృతి చెందిందని పోలీసులు తాజాగా వెల్లడించారు. ఆమె గత కొంత కాలంగా ఉపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతోందని తెలిపారు. ఆ క్రమంలో హులిమావ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మరణించిందని చెప్పారు. కాగా లైంగిక దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోందని వారు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్