బెంగాల్‌లో మనుగడ కోసం టీఎంసీ పోరాటం: మోదీ

73చూసినవారు
బెంగాల్‌లో మనుగడ కోసం టీఎంసీ పోరాటం: మోదీ
లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి ఈ సారి అత్యధిక సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. టీఎంసీ మనుగడ కోసం పోరాడుతోందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పారు. బీజేపీకి 80 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున కాషాయపార్టీకి మద్దతుగా నిలుస్తారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్