రూ. 2. 41 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యం పట్టివేత

4023చూసినవారు
కర్ణాటకకు చెందిన రూ. 2. 41 లక్షలు విలువ చేసే మద్యాన్ని పట్టుకొన్నట్లు అనంతపురం సెబ్ సీఐ యల్లయ్య, ఎస్ఐ సరస్వతి తెలిపారు. మంగళవారం ఉరవకొండ మండలం కొర్రకోడు వద్ద బొలెరో వాహనాన్ని ఆపి పరిశీలిస్తే అందులో మద్యం బాక్సులు ఉన్నాయన్నారు. అదే గ్రామానికి చెందిన రామ్మోహన్ కర్ణాటక నుంచి అక్రమంగా బొలెరో వాహనంలో రూ. 2. 41 లక్షలు విలువ చేసే 40 బాక్సుల్లో 4, 380 టెట్రా ప్యాకెట్లు తీసుకువస్తున్నట్లు గుర్తించామన్నారు.

సంబంధిత పోస్ట్