Mar 14, 2025, 06:03 IST/
రెండు లారీలు ఢీ.. ఇద్దరు వ్యక్తులు స్పాట్ డెడ్
Mar 14, 2025, 06:03 IST
AP: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలంలోని కడప క్రాస్ సమీపంలోని తానామిట్ట అడవిపల్లె దగ్గర శుక్రవారం ఉదయం బెంగళూరు నుంచి రాజమండ్రికి గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు లారీల్లోని డ్రైవర్లు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.