గోపవరం: 150 కేజీల పండ్లతో అలంకరణ

84చూసినవారు
బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలోని వల్లేరవారిపల్లెలో వెలసిన స్వయంభు లక్ష్మీనరసింహస్వామి ఆలయం నందు దసరా పురస్కరించుకొని శనివారం వివిధ రకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 18 రకాలు, 150 కేజీల పండ్లతో అలంకరణ చేసి భక్తులకు దర్శనం ఇచ్చారు. భారీ ఎత్తున భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్