మైదుకూరు: ఆవులు, కుక్కలు, పందుల సంచారాన్ని నిర్మూలించండి

70చూసినవారు
మైదుకూరు: ఆవులు, కుక్కలు, పందుల సంచారాన్ని నిర్మూలించండి
మైదుకూరు పట్టణ ప్రధాన రోడ్డులు, వీధులలో ప్రజలను, ప్రయాణికులను ప్రమాదాలకు గురిచేస్తూ భయం కల్పిస్తున్న ఆవులు, కుక్కలు, పందులను పట్టణం నుండి బయటకు తరలించాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ మైదుకూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని కోరారు. సోమవారం మైదుకూరు పట్టణ రైతు సేవాసమితి అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్, శ్రీనివాసులు ఆధ్వర్యంలో కమిషనర్ తో చర్చించి వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్