ప్రజా ప్రతినిధుల గైర్హాజరీతో సర్వసభ్య సమావేశం వాయిదా

73చూసినవారు
ప్రజా ప్రతినిధుల గైర్హాజరీతో సర్వసభ్య సమావేశం వాయిదా
పీలేరు నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన కలికిరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రజా ప్రతినిధుల గైర్హాజరుతో వాయిదా పడింది. శుక్రవారం కలికిరి ఎంపీపీ వేంపల్లి నూర్జహాన్ అధ్యక్షత ఉదయం 9: 30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఐదుగురు ఎంపీటీసీలు హాజరు కావాల్సి ఉండగా ముగ్గురు మాత్రమే హాజరవడంతో 11: 30 వరకు వేచి చూసిన అనంతరం సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో సీ. గంగయ్య లిఖిత పూర్వకంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్