టిడిపి ప్రచార రథం దగ్ధం ఘటనకు వైకాపాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ దీనిపై తాను తరిగొండ నరసింహ స్వామి ఆలయంలో ప్రమాణానికి కూడా సిద్ధమని, టిడిపి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అందుకు సిద్ధమా అని పీలేరు వైకాపా అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి సవాలు విసిరారు. శనివారం మదనపల్లి-తిరుపతి జాతీయ రహదారిలోని విఠలం వద్ద జరిగన ఘటనను ఆయన ఖండించారు. వాస్తవాలు తెలియకుండా జరిగిన ఘటనను వైకాపాపై మోపడం సబబు కాదన్నారు.