డిప్యూటీ సీఎంకు తులసిరెడ్డి లేఖ

76చూసినవారు
కడప-రాజంపేట-కోడూరు-రేణిగుంట జాతీయరహదారి అతి ముఖ్యమైనదని తులసిరెడ్డి పేర్కొన్నారు. శనివారం వేంపల్లి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూ. 2254 కోట్లతో 122 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారిని మంజూరు చేసిందని తెలిపారు. టెండర్లు పూర్తి అయినా కూడా పనులు మొదలుకాలేదని ఆరోపించారు. 100 హెక్టార్లు అటవీ భూమికి సంబంధించి అనుమతులు రాని కారణంగా పనులు మొదలు కాలేదని అన్నారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు.

సంబంధిత పోస్ట్