చెరువులు, కుంటలు ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహసీల్దార్

67చూసినవారు
చెరువులు, కుంటలు ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహసీల్దార్
ఓబులవారి పల్లి మండలంలో చెరువులు, కుంటలు ఆక్రమించడం కానీ, ప్రభుత్వ భూములు సాగు చేయడం కానీ చేస్తే.. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు కఠిన చర్యలు తప్పవని ఓబులవారి పల్లి డిప్యూటీ తహసీల్దార్ పీర్ మున్నీ హెచ్చరించారు. మంగళవారం ఓబులవారి పల్లి రెవెన్యూ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. మండలంలో చెరువులను ఆక్రమించినట్లు వార్తలు రావడంతో ఆమె సమావేశం ఏర్పాటు చేసి, గ్రామ రెవెన్యూ అధికారులను పరిశీలించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్