ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

75చూసినవారు
ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నమయ్య కలెక్టర్ శ్రీధర్ అధికారులను కోరారు. శుక్రవారం ఓబులవారి పల్లి మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలను వారికి చేరవేయాలి అన్నారు. కార్యాలయాలలో రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆయన సూచించారు. రాజంపేట సబ్ కలెక్టర్ నిధియా దేవి పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్