AP: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2025-26కు ఏపీ అసెంబ్లీ కమిటీలను ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ రూల్స్ కమిటీ చైర్మన్గా అయ్యన్నపాత్రుడు, పిటిషన్ల కమిటీ చైర్మన్గా RRR, ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్గా పితాని, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్గా కామినేని శ్రీనివాస్, ఎథిక్స్ కమిటీ చైర్మన్గా మండలి బుద్ధ ప్రసాద్ నియామకమయ్యారు. ఒక్కో కమిటీలో ఏడుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది.