రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువ ఇంజినీర్ దుర్మరణం చెందాడు. దుండగుడు ఫుల్లుగా మద్యం తాగి కారును డ్రైర్ చేస్తూ బైకర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న నవీన్ చారి అక్కడికక్కడే మరణించాడు. నవీన్ చారికి ఇటీవలె ఉద్యోగం రాగా మొదటి రోజు ఆఫీసుకు వెళ్లి వస్తుండగా ఇలా జరగడంతో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.