ప్రత్యేక హోదా ఏదీ?: షర్మిల

85చూసినవారు
ప్రత్యేక హోదా ఏదీ?: షర్మిల
వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లోని ఆమగంపల్లిలో శుక్రవారం ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘వైఎస్ పాలనలో ఎన్నో అద్భుత పథకాలు అమలు చేశారు. రుణమాఫీ, ఉపాధి హామీ పథకాన్ని వైఎస్ ప్రవేశపెట్టారు. ఆరోగ్య శ్రీ, 40 లక్షల మందికి పైగా ఇళ్లను కట్టించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషి. ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఎన్నికల ముందు జగన్ చెప్పారు. ఇప్పుడు దాని ఊసే మర్చిపోయారు.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్