రూ.40 లక్షలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

546చూసినవారు
రూ.40 లక్షలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
హైదరాబాద్‌లో అక్రమంగా రూ.40 లక్షలను తరలిస్తున్న ఇద్దరినీ హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేవిని ముత్యాలు, రాజేష్‌లు శుక్రవారం ఉదయం అబిడ్స్ రామకృష్ణ థియేటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రూ.40 లక్షలు తీసుకుని వస్తున్నారు. పక్కా సమాచారంతో కారులో వస్తున్న వారిని తనిఖీ చేయగా రూ.40 లక్షలు దొరికాయి. వాటికి సరైనా ఆధారాలు చూపించక పోవడంతో వారిని అరెస్ట్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్