ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.