తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావు ఆదివారం బాధతలు స్వీకరించారు. తొలుత ఆయన క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామిని.. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మాజీ ఈవో ధర్మారెడ్డి అధికారికంగా బాధ్యతలను శ్యామలరావుకు అప్పగించారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా.. జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమీ తీర్థప్రసాదాలు అందజేశారు.