ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశం జరుగనుంది. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్ను అక్టోబర్లో ప్రవేశపెట్టే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.