ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కొరత దృష్ట్యా వారిని ఓపీఓలుగా తీసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును మే 1 వరకు పొడిగించింది.