పెట్టుబడిదారులను రాష్ట్రానికి తిరిగి రప్పించేందుకు ఉన్న అవకాశాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రానికి పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించింది. దాంతో ఎలక్ట్రానిక్ వాహనాలు (ఈవీ) తయారీలో అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ టెస్లాతో పాటు మరికొన్ని పెద్ద కంపెనీల యాజమాన్యాలకు అధికారులు లేఖలు రాస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని వివరిస్తున్నారు.