సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని క్యాట్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ప్రభుత్వం రెండోసారి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయడాన్ని క్యాట్ తప్పుబట్టింది. వెంటనే పోస్టింగ్ ఇచ్చి, మొత్తం జీతభత్యాలు చెల్లించాలని ఏపీ సర్కారును క్యాట్ ఆదేశించింది.