సచివాలయాన్నే జగన్‌ మరిచిపోయారు: మంత్రి ఆనం

74చూసినవారు
సచివాలయాన్నే జగన్‌ మరిచిపోయారు: మంత్రి ఆనం
AP: గ‌త వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేసింద‌ని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. "సచివాలయం అనేదే అప్పటి సీఎం జగన్‌ మరిచిపోయారు. సీఎం సచివాలయానికి రాకపోతే మంత్రులు ఎలా వస్తారు? పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. నిర్మాణాలు ఎక్కడ నిలిచిపోయాయో.. ఇవాళ్టికి అక్కడే ఉన్న పరిస్థితి. నిర్మాణ పనుల్ని మళ్లీ మొదలుపెట్టే పనిలో ఉన్నాం" అని ఆయ‌న పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్