వరాహానికి పాలిచ్చిన గోమాత.. (వైరల్ వీడియో)

79చూసినవారు
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. రామ మందిరం వద్ద ఓ గోమాత విశ్రాంతి తీసుకుంటోంది. అయితే, అదే సమయంలో వచ్చిన ఓ పిల్ల వరాహం గోమాత పొదుగును పట్టి పాలు తాగింది. తన జాతి కాకపోయినా.. బిడ్డ ఆకలి తల్లికే తెలుసన్నట్లుగా ఆ గోమాత పిల్ల వరాహాన్ని బెదరగొట్టకుండా పాలిచ్చింది. ఈ వీడియో చూసిన జనం ఆశ్చర్యానికి లోనయ్యారు. గోమాత పందికి పాలివ్వడం ఏంటని ఆసక్తిగా తిలకించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్