చిత్తూరు జిల్లా కుప్పం వేదికగా నేడు జరగాల్సిన వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీని ప్రకటించనుంది. కాగా, ఇప్పటికే ఈ స్కీమ్ 2, 3 సార్లు వాయిదా పడింది. చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.18,750 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది.