ఏపీని డ్రగ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చారు: షర్మిల

3677చూసినవారు
ఏపీని డ్రగ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చారు: షర్మిల
ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ, కానీ ఇప్పుడు డ్రగ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా ఏపీని మార్చారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ దొరికినా వాటి మూలాలు ఏపీలోనే ఉంటున్నాయన్నారు. ‘‘నిఘా వ్యవస్థకు తెలియకుండా రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ ఎలా వస్తాయి? డ్రగ్స్‌ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? ఈ కేసులో తెర వెనుక ఎంతటి పెద్ద వాళ్లు ఉన్నా నిగ్గుతేల్చాలి‘‘ అని షర్మిల అన్నారు.

సంబంధిత పోస్ట్