టీడీపీ, జనసేన పార్టీలు కీలక ప్రకటన చేశాయి. టీడీపీకి కేటాయించిన పి.గన్నవరం అసెంబ్లీ సీటును జనసేనకు మారుస్తున్నట్లు వెల్లడించాయి. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాగా, తొలుత పి.గన్నవరం అసెంబ్లీ టికెట్ను టీడీపీ నేత మహాసేన రాజేశ్కు చంద్రబాబు ఖరారు చేశారు. అయితే రాజేశ్ అభ్యర్థిత్వంపై స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో తాజాగా మార్పులు చేశారు.