అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ కొనసాగుతోంది. జేసీప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు దాసరి కిరణ్పై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కిరణ్ను వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికివేశారు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు.