ఎన్నికల వేళ.. జనసేన పార్టీకి కొత్త టెన్షన్

74చూసినవారు
ఎన్నికల వేళ.. జనసేన పార్టీకి కొత్త టెన్షన్
జనసేన పార్టీకి కొత్త టెన్షన్ మొదలైంది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కూడా కేటాయించనున్నారు. జనసేన పోటీ చేస్తున్న చోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయిస్తారు. ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా కోరితే వారికి గాజు గ్లాసు గుర్తు కేటాయించే అవకాశముంది. దాంతో జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీ ఓట్లు వేరే అభ్యర్థికి పడే అవకాశాలున్నాయని ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్