సీఎం జగన్పై రాయితో దాడి కేసులో నిందితుడు వేముల సతీశ్ కుమార్కు విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో సతీశ్ను అరెస్టు చేసిన పోలీసులు గురువారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపర్చారు. వాదనలు విన్న కోర్టు నిందితుడికి మే 2 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సతీశ్ను నెల్లూరు సబ్ జైలుకు తరలిస్తున్నట్టు సమాచారం.