సీఎం జగన్పై జరిగిన దాడిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుట్రపూరితంగానే సీఎం జగన్పై దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది. రెండు రకాలుగా దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడికి మధ్య నుంచి రాయితో దాడి చేసి ఉండొచ్చని తెలుస్తోంది.