మంత్రి సత్యకుమార్‌పై హత్యాయత్నం.. ఎస్పీకి ఫిర్యాదు

72చూసినవారు
మంత్రి సత్యకుమార్‌పై హత్యాయత్నం.. ఎస్పీకి ఫిర్యాదు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై హత్యాయత్నం జరిగిందని బీజేవైఎం నేత సురేశ్ తాజాగా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2023లో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపి వస్తుండగా.. సత్యకుమార్ యాదవ్‌తో పాటు కార్యకర్తలపై అప్పటి ఎంపీ నందిగం సురేశ్, మరికొందరు దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్