అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మిర్చి కోతలకు కూలీలతో ఇంద్రావతికి వెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో మాళపురానికి చెందిన 15 మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నలుగురురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.