పంట పొలంలో హీరోయిన్ రోజా బొమ్మ

69చూసినవారు
కొరిశపాడు మండలం కొరిశపాడు గ్రామానికి చెందిన రైతు సింగారెడ్డి తాను సాగు చేసిన మిరప పంటకు దిష్టి తగలకుండా సినీ హీరోయిన్, మాజీ మంత్రి రోజా బొమ్మను పంట పొలాలలో ఏర్పాటు చేశాడు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలు రోజా బొమ్మను ఆసక్తిగా తిలకిస్తున్నారు. రైతు సింగారెడ్డి బుధవారం మాట్లాడుతూ తాను సాగు చేసిన మిరప చేను రోడ్డు వెంబడి ఉండటంతో దిష్టి తగలకుండా ఉండేందుకు రోజా బొమ్మను పొలంలో ఉంచినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్