దర్శిలో ఈనెల 13, 14 వ తేదీలలో జిల్లా స్థాయి ఉద్యమ అధ్యయన తరగతులను నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఏపిటీఎఫ్ అధ్యక్షులు వాకా జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం దర్శి జోన్ ఏపీటీఎఫ్ కార్యాలయంలో కరపత్రాలను ఏపీటీఎఫ్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిహెచ్. శివరామకృష్ణ, దర్శి నియోజకవర్గ ఏపీ బాధ్యులు పాల్గొన్నారు.