వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణపై కేసు నమోదు

85చూసినవారు
వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణపై కేసు నమోదు
వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణపై అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అంబటి మురళి, మరో 12 మంది గత నెల 28వ తేదీన గుంటూరు పట్టణంలోని శ్రీసహస్రలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని నిరసన ధర్నా నిర్వహించారు. వైసీపీ నేతలు భక్తులను లోపలకు వెళ్లనివ్వకుండా ధర్నా చేశారని టీడీపీ నాయకుడు నరేశ్ ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్