డ్రైనేజీలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

50చూసినవారు
గుంటూరులో విచ్చలవిడిగా డ్రైనేజీలను ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీలను ఆక్రమిస్తున్న కారణంగానే వర్షాకాలంలో వరద ముంపు ఏర్పడుతోందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన కాలనీలలో ఆదివారం పర్యటించారు. డ్రైన్ల ఆక్రమణలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్