గురజాల కాపు యువసేన అధ్యక్షుడిగా దుర్గారావు

78చూసినవారు
గురజాల కాపు యువసేన అధ్యక్షుడిగా దుర్గారావు
కాపు యువసేన గురజాల నియోజకవర్గ అధ్యక్షుడిగా దాచేపల్లికి చెందిన మందపాటి దుర్గారావుని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కర్ణా శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. కాపుల అభ్యున్నతికి దుర్గారావు తనవంతు తోడ్పాటు అందించాలని రాబోవు రోజుల్లో కాపుల రాజకీయ, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన పై నమ్మకంతో నియమించిన శ్రీనివాసరావుకి, జిల్లా అధ్యక్షుడు రాముకు దుర్గారావు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్