వరద బాధితులకు 1వ తరగతి విద్యార్థిని విరాళం

50చూసినవారు
వరద బాధితులకు 1వ తరగతి విద్యార్థిని విరాళం
విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం 1వ తరగతి విద్యార్థిని తన పాకెట్ మనీని విరాళంగా అందించింది. పులివెందులకు చెందిన ఒకటో తరగతి విద్యార్ధిని ఎం. వర్ణిక వరద బాధితులను చూసి చలించి పోయింది. వారికి సహాయంచేయాలని అనుకుంది. ఈ క్రమంలో తన బాబాయి ప్రణీత్ కుమార్ తో కలిసి బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ కు తన పాకెట్ మనీ రూ. 72, 500 విరాళంగా అందించింది.

సంబంధిత పోస్ట్