పునరావాస కేంద్రాలను పరిశీలించిన మంత్రులు

67చూసినవారు
పునరావాస కేంద్రాలను పరిశీలించిన మంత్రులు
రేపల్లెలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ లు బుధవారం పర్యటించారు. రేపల్లె మండలంలోని ముంపు గ్రామాల్లో ఒకటైన బొబ్బర్లంకలో సుమారు 50 కుటుంబాలు ఉంటున్న పునరావాస కేంద్రాన్ని మంత్రులు పరిశీలించారు. వారికి అందుతున్న సహాయక చర్యలపై మంత్రులు ఇరువురు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతీ ఒక్క వరద బాధితునికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్