సత్తెనపల్లిలోని 12వ వార్డు రాజు కాలనీలో సైడ్ కాలవల్లో చెత్తాచెదారం పేరుకుపోయినా పారిశుద్ధ్య కార్మికులు పట్టించుకోవడం లేదని బుధవారం స్థానికులు వాపోతున్నారు. కాలవల్లో మురుగునీరు ప్రవాహం ఆగిపోవడం వల్ల దోమలు, దుర్వాసన వస్తున్నాయని, జ్వరాలు బారిన పడతామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్య కార్మికులు పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేయాలని కోరుతున్నారు.