AP: పులివెందులలో తనను కలిసిన వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. "కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్ళీ మంచిరోజులు వస్తాయి. ఎవరూ అధైర్యపడొద్దు, రాబోయే కాలం మనదే. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది. మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉంది.. భవిష్యత్ మనదే. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని పార్టీ ప్రజాప్రతినిధులకు జగన్ సూచించారు." అని వైసీపీ ట్వీట్ చేసింది.