AP: శేషాచలం అడవుల్లో నరికేసిన ఎర్రచందనం దుంగలను ఎక్కడెక్కడ దాచారో గుర్తించాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు. కడప జిల్లా పోట్లదుర్తిలో ₹1.6 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పవన్ దృష్టికి పోలీసులు తెచ్చారు.