కృష్ణా జిల్లా గంగూరులో పెన్షన్ కోసం వెళ్లిన వజ్రమ్మ (80) వడదెబ్బతో మరణించిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న వైసీపీ మంత్రి జోగి రమేష్.. వజ్రమ్మ ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. వజ్రమ్మ మృతదేహంతో చంద్రబాబు ఇంటికి వెళ్దామని జోగి రమేష్ చెప్పడంతో బంధువులు అతనిపై మండిపడ్డారు. వడదెబ్బతో చనిపోయిన వజ్రమ్మ మృతిని రాజకీయం చెయ్యొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.