విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ '2 కోట్ల 54 లక్షల 97వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన ఆర్థిక నేరస్తుడు బోండా ఉమా. ఈ ఆర్ధిక నేరస్తుడికి ఓటు వేయద్దు. 2019, 2014లో ఉన్న కేసులు 2024 అఫిడవిట్లో పొందుపరచలేదు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. బోండా ఉమాపై ఉన్న కేసులపై తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. మా ప్రచారాన్ని అడ్డుకోవడానికి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు' అంటూ ధ్వజమెత్తారు.