రాష్ట్రంలో రేపటి నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన సదరం స్లాట్లకు దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపింది. స్లాట్లు బుక్ చేసుకున్న వారికి ఈ నెల 8 నుంచి వైద్యులు
పరీక్షలు నిర్వహించి సదరం ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామని పేర్కొంది.