BREAKING: ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

44885చూసినవారు
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు ప.గో. జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వారిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్